జిల్లాలోని అటవీ ప్రాంత ప్రజలందరికీ మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని అటవీ ప్రాంత ప్రజలందరికీ మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.

 

తేదీ,  జూలై,  22, 2025–
నమస్తే భరత్

    మంగళవారం సాయంత్రం నిర్మల్ పట్టణంలోని కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో జిల్లా స్థాయి అటవీ కమిటీ (డి ఎల్ సి) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా, మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు అటవీ శాఖ అధికారులు సహకరించాలని చెప్పారు. మెరుగైన వసతుల కల్పన ద్వారా అటవీ ప్రాంత ప్రజల అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. మెరుగైన రోడ్డు, రవాణా సౌకర్యాలు కల్పించడం ద్వారా జిల్లా కేంద్రానికి, మండలానికి కనెక్టివిటీ పెరుగుతుందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపట్టే ముందు సంబంధిత శాఖల అధికారులు పరివేష్ పోర్టల్ లో అనుమతులు తీసుకోవాలన్నారు. అలాగే కడెం మండలం మైసంపేట్ పునరావాస  గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి మనీ ప్యాకేజీ, అటవీ హక్కుల చట్టం కింద సాగుభూములు అందించే ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పునరావాస గ్రామాన్ని అన్ని అంశాల్లో అభివృద్ధి చేసేందుకు పటిష్ట చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
    ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డి ఎఫ్ ఓ నాగిని భాను, ఆర్డిఓ రత్నకళ్యాణి, రెవెన్యూ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నారాయణపేట జిల్లాలోని బైరంకొండ గ్రామంలోవెంటనే ఉపాధ్యాయులునీ నిర్మించాలని అన్నారు నారాయణపేట జిల్లాలోని బైరంకొండ గ్రామంలోవెంటనే ఉపాధ్యాయులునీ నిర్మించాలని అన్నారు
,,,,నమస్తే భరత్,,,29/7/2025/,నారాయణపేట జిల్లా,,,మండలం లోని బైరంకొండ గ్రామంలో వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని జిల్లా విద్యా శాఖ అధికారులకు మాజీ సర్పంచులు సాయిబన్న, రామకృష్ణ శివప్ప గ్రామ యువకులు...
మూల మర్రి తండాలో ఉచిత వైద్య శిబిరం.
పెన్షన్ దారులను ఇబ్బంది పెడితే పుట్టగతులుండవ్..!
ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువులను స్టాక్ బోర్డుల్లో ప్రదర్శించాలి:
నూతన రేషన్ కార్డులతో పేదలకు కడుపునిండా అన్నం:
కోస్గి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
చేతి వృత్తులకు భవిష్యత్తులో విలువ పెరుగుతుంది – జిల్లా కలెక్టర్