కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.
---కార్మికులకు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి
---కార్మికులు ఐక్యంగా ఉద్యమాన్ని తీవ్రతరం చెయ్యాలి.
---హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ సార్,
టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు యం హన్మేష్
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
నేడు టియుసిఐ నారాయణ పేట జిల్లా కేంద్రంలో జిల్లా మొదటి మహాసభల సందర్భంగా కొత్త బస్టాండ్ నుండి నర్సిరెడ్డి చౌరస్తా , పాత బస్టాండ్ , మెయిన్ చౌక్, సరాఫ్ బజార్ మీదుగా ఎస్ ఆర్ గార్డెన్ వరకు బారి ఎత్తున కార్మిక ప్రదర్శన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎచ్ సియు ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ సార్, టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు యం. హన్మేష్ కు ముఖ్య వక్తలుగా మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు తీవ్రంగా శ్రమ చేసే వారు. పాలకుల రూపంలో ఉండే పెట్టుబడి దారులు మన కష్టాన్ని దోచుకునే వాళ్ళు మన సమస్యలను విన్నవిస్తే పరిష్కారం చేయడం పక్కన పెడితే మనల్ని గౌరవించే విధంగా ఉండటం లేదు. అందుకని కార్మికులందరూ కూడా తప్పకుండా కలిసి పనిచేసే విధంగా ఐక్యంగా పోరాడాలి. మన కష్టం మనకు రావడం లేదు అంటే ఎక్కడికి పోతుందో మనం అర్థం చేసుకోవాలి. దేశంలో వేల కోట్ల సంపద మొత్తం అతి కొద్దు మంది దగ్గరే పొగుపడింది. వారే మన శ్రమను చూచుకునే చేసే దోపిడీదారులు. వారికి కొమ్ము కాస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఒక మీటింగ్ లో మన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను బీజేపీ లో పాఠశాల , టిడిపి లో కళాశాల కాంగ్రెస్ లో ఉద్యోగం చేస్తున్న అన్నాడు. అందుకే కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజా కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలే. అందుకే కార్మిక సంఘాల ఐక్యతను నిర్వీర్యం చేయడం కొరకు కార్మిక చట్టాలను రద్దు చేసి, 4 కోడ్లు గా మార్చి కార్మిక సంఘాల అణచివేతకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కార్మికులకు సెలవులు ఉండాలి. పని చేస్తున్న దగ్గర సౌకర్యాలు ఉండాలి. ప్రమాదం చరగకుండా పని ముట్లు ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వకుండా పెట్టుబడి దారులకు మేలు చేయడం కొరకు కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చడం కొరకు కార్మికుల శ్రమను , వాళ్ళ బతులకు కూడా తాకట్టు పెట్టడం ఈ ప్రభుత్వాల విధానం. పెట్టుబడి దారులు రూపం మార్చుకొని కార్మికులను దోచుకోవడం జరుగుతుంది. పెదాలు ధనికుల మధ్య చాలా తేడా పెరిగింది. అదానీ అంబానీ ల సంపాదన మీద పన్ను వసూలు చెయ్యకుండా రాయితులు ఇస్తున్నారు. అవసరం ఐతే వేల కోట్ల రూపాయల పన్నులను రద్దు చేస్తున్నారు. మన ఉమ్మడి పాలమూరు జిల్లా వలస కార్మికులు అధికం ముంబై, హైదరాబాద్, డిల్లీ,బెంగుళూరు నగరాలలో భావనలు కట్టడం , ఆటో కార్మికులు ఇతర రంగాలలో చాలి చాలని వేతనాలకు పని చేస్తున్నారు. కార్మికులు వలసల వలన వాళ్ళ పిల్లల చదువులు , వాళ్ళ బతుకులు రోడ్డుపాలు కావడం చూస్తానే ఉన్నాం. బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చదువులో కూడా మతాన్ని జొప్పించి విద్యార్థుల మెదళ్లను నూతన ఆలోచనలకు బదులు మతోన్మాద , ఉన్మాదపు ఆలోచన చేసేటట్లు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకని కార్మికుల హక్కుల రక్షణ కోసం, కనీస వేతనాలు 26,000 వేలు అమలు కై, సకాలంలో జీతాలు ఇవ్వడం కొరకు సమస్యల పరిష్కారం కొరకు కార్మికులు అందరూ ఐక్యం కావాలని, కార్మిక సంఘాల పోరాటాలు తీవ్రతరం కావాలని అప్పుడే రాష్ట్రంలో దేశంలో మార్పు వస్తుందని అందుకోసం టియుసిఐ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బలమైన పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.యం. హన్మేష్ టియుసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా జనాభా ఉన్న దేశం మనం , రేషన్ కావాలన్న, ఇందిరమ్మ ఇళ్లు కావాలన్న, ఉద్యోగం కావాలన్న ప్రభుత్వాల తో పడిగాపులు కాయడం మనం చూస్తున్నాం. కార్మికులు చేసే పనిలో అగౌరవంగా మాట్లాడితే తిరగడబడం మనకు తెలిసిన విషయం. అట్లనే నరేంద్ర మోడీ ఒక్కొక్కరీ అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పిన మోడీ అమిత్ షా నేడు వాటిని పక్కన పెట్టి ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా పాలన సాగుతోంది. ప్రజలు ఘర్షణ పడేటట్లు పాలన చేస్తున్నారు. నిన్నగాక మొన్న గుజరాత్ లో విమానం కూలి వందల మంది ప్రజలు చనిపోయారు. ఆ విమానాన్ని టాటా కంపెనీకి , ఆ విమానాశ్రయాన్ని అదానీ కి అమ్మిన మోడీ సర్కారు. పెట్టుబడి దారులకు మేలు చేయడం కొరకు ప్రజల ప్రాణాలను కూడా తియ్యడం కొరకు వెళ్ళటం లేదనేది వాస్తవం. బి యస్ఎన్ఎల్ , యల్ ఐ సి, ఓడరేవులు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానికి ,అంబానీలకు అప్పనంగా అమ్మడం మోడీ సర్కారు విధానం. కానీ ప్రజలకు కార్మికులకు కనీసం వేతలను ఇవ్వడం లేదు. కార్మికులను పర్మనెంట్ చేయడం లేదు. ఒక కార్మికులు బతకడానికి కనీస వేతనం 26,000 వేలు ఇవ్వాలి. కానీ 10,000 వేలంటే ఎక్కువ ఇవ్వడం లేదు. కట్టుకోవడానికి ఇల్లు లేదు. పిల్లల చదువులకు బరోసా లేదు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కార్మికుల కర్త్యవం కావాలి. అందుకే అన్ని రంగాల కార్మికులు ఐక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవాలి. ప్రభుత్వాల భారతం పట్టాలి. మన హక్కులను సాధించుకోవాలి. మన ఉద్యోగాలను పర్మనెంట్ చేసే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేద్దామని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సభలో సీపీఎంలు మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి బి. రాము , డివిజన్ కార్యదర్శి కాశినాథ్, జిల్లా నాయకులు అడ్వకేట్ కాళేశ్వర్, యాదగిరి, పీఒ డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి,పిడిఎస్ యు జాతీయ నాయకులు పెద్దింటి రామకృష్ణ, అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి కే .కృష్ణ, టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ, మాస్ లైన్ పార్టీ టౌన్ కార్యదర్శి కేంచే నారాయణ,పిడియస్ యూ జిల్లా అధ్యక్షులు సాయి, రైతు సంఘం నాయకులు ప్రశాంత్, కొండ నర్సింహులు,పీవైల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్, పిఒడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శారద, సౌజన్య, రైతు కూలీ సంఘం నేతలు బాలకృష్ణ, చెన్నారెడ్డి, నారాయణ,వెంకట్ రెడ్డి,టియుసిఐ నాయకులు బోయిన్ పల్లి రాము, ఎదురింటి నరసింహ,చెన్నప్ప, రాజు, ఏజి భుట్టో, హాజీ , మాస్ లైన్ పార్టీ టౌన్ నాయకులు శివాజీ తదితర నేతలతో పాటు వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
