ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.  ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకటరెడ్డి 

ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం.  ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకటరెడ్డి 

 


నమస్తే భారత్ జూన్ 17 తలకొండ పల్లి 

రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండలం వెల్జాల్ గ్రామం లో మంగళవారం నాడు భూభారతి రెవెన్యూ సదస్సు. రైతు వేదికలో ఎమ్మార్వో నాగార్జున ఆద్వర్యంలో నిర్వహించారు. రైతులు ఎన్నో సంవత్సరాలుగా భూ సమస్యలతో సతమతమవుతున్నారు. భూ సమస్యలతో భాద పడుతున్న రైతులు తమ సమస్యలు రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని తమ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ. భూభారతి దేశ చరిత్రలో అరుదైన చట్టం అని అన్నారు. రైతుల భూములకు సంపూర్ణంగా సరిహద్దులు గుర్తించి, భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు లేకుండా భద్రత కల్పించడమే లక్ష్యం అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి రైతుల హక్కులను కాలరాశింది. ఒకవైపు తమకు కావాల్సిన వారికే భూములు కట్టబెట్టి, తిరిగి సవరణకు అవకాశం లేకుండా చేసిందని దుయ్యబట్టారు.  కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం ద్వారా పేదలకు పంచిన 26 లక్షల ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పార్ట్ Bలో పెట్టి, విచారణ లేకుండా పేద ప్రజల హక్కులు లాక్కుందన్నారు.‌
ప్రజా ప్రభుత్వంలో భూ  భారతి చట్టం ద్వారా ప్రజలకు సరియైన న్యాయం జరుగుతుంని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో నాగార్జున, ఆర్ ఐ శ్రవణ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ సింగల్ విండో చైర్మన్ ఏ అంజయ్య గౌడ్ ,మాజీ ఎంపీటీసీలు జి శ్రీనివాస్ మూర్తి, ఎం అంబాజీ, టి వెంకటయ్య ముదిరాజ్, వెంకటాపూర్ మాజీ సర్పంచ్ పి రమేష్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ బి. నర్సింలు, ఎం.ఏ.అజీజ్, మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, పి అశోక్ బాబు డి .తిరుపతి రెడ్డి, టి కృష్ణయ్య గౌడ్, ఏ రవీందర్ గౌడ్, రేణు రెడ్డి, రాజేందర్ నాయక్, బి యాదగిరి, ఎల్ మల్లేష్,పి విష్ణు, చౌదర్ పల్లి, మాధయ పల్లి, ఇశ్రాయపల్లి, చెన్నంపల్లి వెంకటాపూర్, సంగయ పల్లి వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం : ఎమ్మెల్యే బాలు నాయక్‌ భూ నిర్వాసితులను అన్ని విధాల ఆదుకుంటాం : ఎమ్మెల్యే బాలు నాయక్‌
దేవ‌ర‌కొండ రూర‌ల్‌, జూన్ 18 : భూ నిర్వాసితుల‌ను అన్ని విధాల ఆదుకుంటామ‌ని దేవ‌ర‌కొండ ఎమ్మెల్యే నేనావ‌త్ బాలు నాయ‌క్ తెలిపారు. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్...
ఆర్టీసీ ఉద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి : ఆర్టీసీ ఉద్యోగుల వినతి
స‌మ‌ర్థ‌వంతంగా ఇంకుడు గుంతల నిర్మాణం : సంతోష్‌ కుమార్‌
ఘనంగా మనేశ్వర్ రావు జన్మదిన వేడుక
గ‌ద్వాల‌లో పౌర హ‌క్కుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు అరెస్ట్
రెడిట్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా స‌చిన్ టెండూల్క‌ర్
మార్పు కోసం.. ‘ప్రియుడి మోజులో భార్య.. కుప్పకూలిన భర్త’ షూటింగ్‌ షురూ