గోదావరి వరద బాధితులకు, స్థలం లేని ఆదివాసీ పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి
తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి డి పున్నoచంద్
ప్రగతిశీల మహిళా సంఘం (స్త్రీసంఘటన) జిల్లా కార్యదర్శి తోలెం మమత
నమస్తే భారత్: బూర్గంపాడు
గోదావరి వరద ముంపు బాధితులకు స్థలం లేని ఆదివాసి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, హైకోర్టు తీర్పును అమలు చేయాలని తెలంగాణ రైతుకూరి సంఘం జిల్లా కార్యదర్శి పున్నంచంద్, ప్రగతిశీల మహిళా సంఘం (స్త్రీసంఘటన) జిల్లా కార్యదర్శి తోలెం మమత డిమాండ్ చేశారు. గోదారి వరద బాధితులకు, ఆదివాసి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బూర్గం పహాడ్ మండల తాసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ రైతు కూలీ సంఘం ప్రగశీల మహిళా సంఘం (స్త్రీసంఘటన) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి తహసీల్దార్ శిరీష గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్పందించిన తహసిల్దార్ సమస్యను త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు పున్నoచంద్, మమత మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం గోదావరి వరద ముప్పు సమస్య వల్ల గ్రామాలు, కాలనీలు నీట మునిగి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ నష్టం బూర్గంపాడు మండలంలో అధికంగా ఉంటుందని తెలిపారు. 2002 నుండి గోదావరి వరద బాధితులు, ఇంటి స్థలం లేని ఆదివాసీలు మెరక ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 500 రోజులు నిరసన కొనసాగించారన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వరద ముంపు ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్యాకేజీ, మెరక ప్రాంతంలో ఇంటి స్థలాలు సేకరించి డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామని ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలిందని అన్నారు. ఫారెస్ట్ వారి ఆక్రమణలో ఉన్న 437/1 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేశారని, వాటిని ఫారెస్ట్ అధికారులు కూల్చి వేయగా బాధితులు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు వీరందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వాలని తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అప్పటినుండి ఇప్పటివరకు ఈ మూడు సంవత్సరాలుగా అధికారులకు అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సమస్య ఇంకా పరిష్కరించబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమ బాధలు తీరుతాయని ఆశగా ఎదురుచూసిన ముంపు బాధితులకు, ఇంటి స్థలాలు లేని ఆదివాసీ పేదలకు నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ వర్షాకాలం గోదావరి వరద ముంపు ప్రమాదం పొంచి ఉందని, ఇప్పటికైనా తక్షణమే ఫారెస్ట్ వారి ఆక్రమణలో ఉన్న 437/1 సర్వే నెంబరు రెవెన్యూ భూమిని బయటికి తీసి ఇంటి స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం (స్త్రీసంఘటన) జిల్లా అధ్యక్షురాలు కుంజ సోమక్క, జిల్లా నాయకులు సోంది గోపమ్మ, గంజి కోటమ్మ, శాంతికుమారి, బి వెంకటనరసమ్మ, తెలంగాణ రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు కుంజ వెంకటేశ్వర్లు, కారం నరసింహారావు, నాగయ్య, ఊకే సుశీల, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

