ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి : సొసైటీ చైర్మన్ దేవళ్ల ప్రసాద్
*జిన్నూరు శివాలయం అభివృద్ధికి పాటుపడతా : చైర్మన్ సత్యనారాయణమూర్తి
జిన్నూరు శివాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
నమస్తే భారత్, పోడూరు, ఆగస్టు - 24 :
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత కల్పించేలా పండుగలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిన్నూరు సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ దేవళ్ల ప్రసాద్ నూతన పాలవర్గానికి సూచించారు.పోడూరు మండలం జిన్నూరులో కొలువైన శ్రీచెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానానికి నూతన పాలకవర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ గా ఆచంట సత్యనారాయణమూర్తి, ట్రస్టీలుగా దొమ్మేటి శ్రీదేవి, బూర్ల శ్రీపద్మ, చెల్లబోయిన సత్యవతి, చొప్పల రాజమణి, చీపురుపల్లి లలిత, నడివింటి రమాదేవి, కుక్కల వరహాలక్ష్మీ నరసింహారావు, ఇంటి శరన్ బాబు, అర్చకులు యోగానందం సాయి శివ సుబ్రహ్మణ్యం కో ఆప్షన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యనిర్వాహణాధికారి ఆదిమూలం వెంకట సత్యనారాయణ పాలకవర్గంతో ప్రమాణం చేయించారు. దేవస్థానం చైర్మన్ చైర్మన్ సత్యనారాయణమూర్తిని, ట్రస్టీలను జిన్నూరు సొసైటీ చైర్మన్ దేవళ్ల ప్రసాద్, మట్టపర్రు నీటి సంఘం అధ్యక్షులు దేవళ్ల శ్రీరామ కోటి మోహన్, ఏఎంసీ వైస్ చైర్మన్ దాసరి రత్నరాజు, జిన్నూరు నీటి సంఘం అధ్యక్షులు కుక్కల సత్యనారాయణ తదితరులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులుదేవళ్ళ ప్రసాద్ మాట్లాడుతూ ఆలయం అభివృద్ధికి నూతన పాలకవర్గం
కృషి చేయాలన్నారు. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆచంట సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చైర్మన్ పదవీ బాధ్యతలను తనకు అప్పగించినందుకు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కూటమి నాయకులకు, స్థానిక పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెనుమదం ఎంపీటీసీ సభ్యుడు మానేపల్లి శ్రీధర్, వేడంగి ఎంపీటీసీ సభ్యుడు మట్టపర్రు నీటి సంఘం అధ్యక్షులు దేవళ్ల శ్రీరామ కోటి మోహన్, జిన్నూరు కుక్కల సత్యనారాయణ, టిడిపి గ్రామ అధ్యక్షుడు పెన్మెత్స కాశీ విశ్వనాథరాజు, కార్యదర్శి గిరికి గోపాలకృష్ణ (జీకే), ఉపాధ్యక్షులు రెడ్డి ఆనంద్, మండల యూత్ అధ్యక్షులు జడ్డు సూరి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చొప్పల శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచులు యలకల శ్రీనివాస్, గుబ్బల శ్రీరామ్, బూత్ కన్వీనర్లు వల్లూరి ధనుంజయ్, ఆచంట సాయిరాం, గండేటి చంద్రశేఖర్, పార్టీ శ్రీనివాస్, జనసేన మండల అధ్యక్షుడు పితాని వెంకీ, గ్రామ అధ్యక్షుడు చివటం సతీష్, వెడంగిపాలెం జనసేన అధ్యక్షుడు లంకలపల్లి రవీంద్ర ప్రసాద్, జనసేన నీటి సంఘం డైరెక్టర్ దాసరి సూర్యనారాయణ,రియా మైగాపుల పద్మజ దాసరి సూర్యనారాయణ సూర్యనారాయణ, కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

