చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటాం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి
నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్
మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి.అభిమానుల మధ్య ఘనంగా పేట ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మా తాత స్వర్గీయ చిట్టెం.నర్సిరెడ్డి,మా తండ్రి స్వర్గీయ. చిట్టెం. వెంకటేశ్వర్ రెడ్డిల ఆశయ సాధనలో మా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం చివరి శ్వాస వరకు పనిచేస్తామని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికరెడ్డి మరియు మాజీ డిసీసీ అధ్యక్షులు కుంభం. శివకుమార్ రెడ్డి లు అన్నారు. బుధవారం నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్.చిట్టెం పర్ణిక రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అభినందన్ గార్డెన్ ఫంక్షన్ హల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల,మధ్య జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ఘనంగా జరుపుకున్నారు. జిల్లా ప్రభుత్వ అధికారులు, వివిధ మండలాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యేకు శాలువా పూలమాలతో సన్మానించే శుభాకాంక్షలు తెలిపారు. మరికల్ మండల నాయకులు సూర్య మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక గజమాలతో ఎమ్మెల్యే ను సన్మానించారు. అదేవిధంగా జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.30 మంది యువజన కాంగ్రెస్ నాయకులు రక్తదానం చేశారు.హిందూ,ముస్లిం మరియు క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించి ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం.పర్ణిక రెడ్డిని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఓ ఆశయం కోసం మా మేనమామ కుంభం శివకుమార్ రెడ్డి 20 ఏళ్లుగా చేసిన కష్టానికి మీరందరూ తోడుగా నిలబడినందుకు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అన్నారు. ప్రజలు పదేళ్లు అధికారమిస్తే అభివృద్ధి చేయకుండా నేడు ప్రతిపక్షంలో ఉన్న కొందరు నాయకులు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఎవ్వరు ఏం మాట్లాడినా వాటిని పట్టించుకోనన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవ చేసుకుంటూ పోతానన్నారు. గత 10 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఇవ్వని సంక్షేమం పథకాలు,కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లోనే అమలు చేసి అర్హులకు అందజేస్తున్నామన్నారు. 10 ఏళ్లు అధికారమిస్తే చేయలేని పనిని ఈ 18 నెలల కాలంలో ఈ ప్రాంతానికి సాగునీరు ప్రాజెక్టు సాధించుకున్నామన్నారు. త్వరలో ఈ ప్రాంతానికి సాగునీరు అందించే ప్రజల స్వప్నం సహకారం చేస్తామన్నారు. విద్యా వైద్యం ప్రజలకు అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని, రాబోయే మూడేళ్లలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ పుట్టిన పిల్లలు అమ్ముకుంటూ ఆకలి చావులతో వలసలతో బీడువారిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఆనాడు పనిచేసిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి మరియు తన బావ చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డిల ఆశయ సాధన కోసం 20 ఏళ్లుగా నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ జిల్లా ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. గతంలో ముఖాలు చూసి సంక్షేమ పథకాలు ఇచ్చారని,ఈరోజు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లో పేదలకు, అర్హులైన బడుగు బలహీన వర్గాలకు పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు, పేట కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతన్నలకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానన్నారు. వారి న్యాయమైన డిమాండును గౌరవించి వారికి నష్టపరిహారం పెంచే విధంగా ఈ జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహతో నేరుగా రైతులతోనే చర్చించడం జరిగిందని తప్పకుండా ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచుతుందని ఆశభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పేట మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎండి సలీం, మాజీ మార్కెట్ చైర్మన్ బండి వేణుగోపాల్ సరాఫ్.నాగరాజ్,సుధాకర్, సీనియర్ నాయకులు కోట్ల రవీందర్ రెడ్డి, గందే.చంద్రకాంత్,హరి నారాయణ భట్టాడ్,బోయ శరణప్ప,వివిధ మండలాల అధ్యక్షులు కావాలి నరహరి ముదిరాజ్, వీరన్న, సూర్య మోహన్ రెడ్డి, రవీందర్, విద్యాసాగర్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్లు పుట్టి ఇదప్ప,కే.నరసింహారెడ్డి, వెంకట్రామారెడ్డి, ఫిషరీస్ చైర్మన్ కాంత్ కుమార్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, యూసఫ్ తాజ్, అంజిరెడ్డి,
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

