జికేఓసి మరియు ఎంవిటిసిలో మల్టీ డిపార్ట్మెంట్ టీం సభ్యుల సమావేశం..
నమస్తే భారత్ (ప్రతినిథి ప్రశాంత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఆగస్టు -19)_ సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్. బలరాం గారి ఆదేశానుసారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు గారి దిశా నిర్దేశాలతో కొత్తగూడెం ఏరియాలోని ఉదయం జికేఓసి నందు జీకే ఓసి & ఏరియా స్టోర్స్ ఉద్యోగులకు మరియు సాయంత్రం ఎంవిటిసి నందు ఎంవిటిసి లోని ట్రైనింగ్ ఉద్యోగులకు, అప్రెంటిస్ అభ్యర్థులకు అలాగే సివిల్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్, రుద్రంపూర్ డిస్పెన్సరీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం ను నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జీకే ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ తేదీ.12.08.2025 నుండి 14.08.2015 వరకు మరియు 16.08.2025 & 18.08.2025 రోజులలో మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం మన కొత్తగూడెం ఏరియా నందు జరుపుకుంటున్నట్లుగా అందులో భాగంగా ఈరోజు ఉదయం జీకే ఓసి నందు జీకే ఓసి & ఏరియా స్టోర్స్ ఉద్యోగులకు సాయంత్రం ఎంవిటిసి నందు ఎంవిటిసి లోని ట్రైనింగ్ ఉద్యోగులకు, అప్రెంటిస్ అభ్యర్థులకు అలాగే సివిల్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్, రుద్రంపూర్ డిస్పెన్సరీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, బొగ్గు వినియోగత పెరిగినందువలన నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తిని చేసి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును రవాణా చేసి సంస్ధ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో అధిగమించి సంస్ధ అభివృద్ధికి తోడ్పడాలని మన సంస్థ, మన గని మన బాధ్యతలను వివరించే ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా మన సంస్థ యొక్క స్థితిగతులను తెలుసుకొనుటకు ఎంతగానో ఉపయోగపడుతుందని అలాగే ప్రతి ఒక్కరూ అంకితభావంతో సమిష్టి కృషితోనే ఇది సాధ్యమని, నాణ్యత గల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచుదాం మరియు సంస్థను ముందుకు తీసుకుపోదాం అని తెలియజేయడం జరిగింది.
అనంతరం ఎస్ఈ (ఐఈడి) కే.ఆర్ నాగభూషణం గారు మల్టీ డిపార్ట్మెంట్ టీం సమావేశం యొక్క ఉద్దేశమును అనగా సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత, మిషనరీ పనితనం, ఉత్పత్తి వ్యయం మరియు ఉద్యోగుల సంక్షేమ కొరకు సింగరేణి సంస్థ తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హాజరైన ఉద్యోగులందరికీ వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జియం జీ.వి.కోటిరెడ్డి, డిజిఎం (ఐఈడి) ఎన్.యోహాన్, జీకేఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.శ్రీ రమేష్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఐ.వి.ఎస్.బి లక్ష్మణ మూర్తి , మేనేజర్ ఎస్. శ్రీరామచంద్ర మురళి, ఎస్ఈ (ఐఈడి) కే.ఆర్ నాగభూషణం, డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ ఎం.రమేష్, ఎంవిటిసి మేనేజర్ జి.లక్ష్మణ్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ యూ. అభిలాష్, ఇతర ఉద్యోగులు, సూపర్వైజర్లు మరియు అధికారులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

