యూరియా సరపరాపై స్పెషల్ ఫోకస్.

యూరియా సరపరాపై స్పెషల్ ఫోకస్.



 స్వయంగా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ.

నమస్తే భారత్ :-మహబూబాబాద్ 

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు, ఆగ్రోస్ వ్యవసాయ దుకాణాల ద్వారా, ఇతర ప్రైవేటు షాపుల ద్వారా యూరియా విక్రయించాలని, అవసరం ఉన్నచోట డిమాండ్ కు అనుగుణంగా యూరియాను తెప్పించడం కోసం ప్రతిపాదనలు పంపించామని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా లో యూరియా ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ ల ప్రత్యేక్షపర్యవేక్షణలో అధికారయంత్రాంగం ముందుకు సాగుతోంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సంబంధిత మండల స్థాయి అధికారులు రైతు వివరాలు పాసుబుక్, ఆధార్ కార్డ్, ద్వారా ఆన్లైన్ విధానంలో ప్రస్తుతం ఉన్న యూరియాను సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు..యూరియాను అధిక ధరలకు అసలు విక్రయించకూడదని, కృత్రిమ కొరత సృష్టించవద్దని ఆయన హెచ్చరించారు.సహకార శాఖ, ఫర్టిలైజర్స్ షాప్ యజమానులు రైతులకు యంత్రాంగానికి సహకరిస్తూ ఉండాలని సూచించారు.
అనవసర వదంతులను రైతులు అసలు నమ్మవద్ద ని తెలిపారు, కొంతమంది అక్రమ నిల్వలు చేసినట్లు, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు, తమ దృష్టికి వచ్చిందని అట్టి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీల ద్వారా నిత్యం ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేయాలని, పి ఓ ఎం ఎస్, ఆన్లైన్, గోడౌన్ నిలువలు సరిపడాలని సూచించారు, 
ప్రస్తుతం ఉన్న సేల్స్ వివరాలను స్టాక్ వివరాలను విషయ సూచిక ద్వారా రైతులకు తెలియపరచాలని ఆయన కోరారు.సంబంధిత అన్ని విభాగాలు సమన్వయంతో కలిసి పనిచేసే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను పంపిణీ చేయాలని ఆయన సూచించారు, 
నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రస్తుతం వేయవలసిన యూరియా ఫర్టిలైజర్స్ గురించి స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదికల ద్వారా ప్రజలకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు,మీ.
 ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు  యూరియా అమ్మకాలు చేయాలన్నారు.ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ మాట్లాడుతూ జిల్లాలో రైతులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ యంత్రాంగం జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించవద్దని ఆయన అన్నారు, వీలైతే టోకెన్ స్మార్ట్ ల ద్వారా అమ్మకాలు జరపాలని సూచించారు.
 పూర్తిస్థాయిలో యూరియా అమ్మకాలపై పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టిందన్నారు. అన్ని మండలాలకు యూరియా నిలువలు వచ్చేలా ప్రభుత్వం,
అధికారయంత్రాంగం కృషి చేస్తుందని, ప్రతి మండలానికి యూరియా లోడ్ లు వస్తాయని, రైతులు కొంత సంయమనంతో వ్యవహరించాలని కోరారు

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Error on ReusableComponentWidget

Latest News

చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటాం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటాం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి
    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి.అభిమానుల మధ్య ఘనంగా పేట ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.వెనుకబడిన ఈ ప్రాంతం
నూతన ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభోత్సవం లో మరియు నూతన గృహప్రవేశంలోపాల్గొన్న
సిపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేయాలి
ఆగమరిస్తే అంతే సంగతి 
జిల్లా రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు.
దోమలు నివారణకు జాగ్రత్తలు పాటించాలి:
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీస్ పాయింట్ ప్రారంభం