పెన్షన్ దారులకు నమ్మకద్రోహం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
పెంచుతామన్న పెన్షన్ ముఖ్యమంత్రి పెంచరు, ప్రతిపక్షం అడుగరు ..?
కాబట్టే పేద వర్గాల బిడ్డగా పెన్షన్ కోసం కొట్లాడుతున్నాను.
రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయడం చేతకాకపోతే రాజీనామా చెయ్..
కాళ్లులేనొల్ల, చేతులు లేనోళ్ల, కండ్లు లేనోళ్ల పెన్షన్ పైసలను ఎగగొట్టి రేవంత్ సర్కార్ దగా చేసింది.
సెప్టెంబర్ 09 డెడ్ లైన్.. 9 లోపు గనక పెన్షన్ పెంచాలీ లేనిచో
లక్షలాది మందితో పరేడ్ గ్రౌండ్లో పెన్షన్ దారుల మహాగర్జన నిర్వహిస్తాం.
పెరేడ్ గ్రౌండ్ సభకు సిద్ధం కండి.. పెన్షన్ ఎలా పెరుగదో చూసుకుందాం.
శంషాబాద్ లో పెన్షన్ దారుల సమావేశం లో
ఎం ఆర్ పి ఎస్ నాయకులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ
నమస్తే భరత్, రాజేంద్రనగర్, ఆగస్టు 18.ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వి ఎచ్ పి నాయకులు హనుమంత్ రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.వికలాంగుల పెన్షన్ 4000 నుండి 6000 కు, వృద్ధులు, వితంతువుల చేయూత పెన్షన్ 2016 నుండి 4000 వరకు, కండరాల క్షీనత రోగులకు, ఇతర తీవ్రమైన రోగులకు 15000 కి ఆంధ్రప్రదేశ్ లో లాగా పెంచి, తెలంగాణ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, పెన్షన్ పెంచుతామని గద్దెనెక్కి 21 నెలలు గడుస్తున్న పెంచుతామన్న పెన్షన్ పెంచకుండా నమ్మకద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెన్షన్ దారుల శక్తి ఏంటో చూపించేందుకె సెప్టెంబర్ 9న లక్షలాది మందితో పరేడ్ గ్రౌండ్లో పెన్షన్ దారుల మహాగర్జన నిర్వహిస్తున్నామని, సభకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి బంగ్లాలో పుట్టాడు, కేసీఆర్ గడిలో పుట్టాడు కాబట్టి వాళ్లకు పేదల బాధలు పట్టవు, నేను పూరి గుడిసెలో పుట్టాను, పేదల బాధలు నాకు తెలుసు కాబట్టే పెన్షన్ పెంచాలని పేదల కోసం రాష్ట్రం మొత్తం తిరుగుతున్నానని అన్నారు.ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేయూత పెన్షన్ 4 వేలు, వికలాంగుల పెన్షన్ 6 వేలు ఇస్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఇస్తానన్న పెన్షన్ ఇవ్వకుండా నెలకు వచ్చే పెన్షన్ 2 వేల చొప్పున లెక్కేసిన నెలకు వెయ్యి కోట్లతో 21 నెలలుగా 21వేల కోట్ల రూపాయల డబ్బుల్ని వారికి ఖర్చు చేయకుండా దగా చేశారని అన్నారు. పెన్షన్ మీదనే ఆధారపడి జీవించే ప్రజల్ని గాలికి వదిలేసి పాలన చేసే ముఖ్యమంత్రికి పేదల గోస పట్టదా..? అని ప్రశ్నించారు. పెన్షన్ పై ఇచ్చిన హామీ ప్రకారం నిలబెట్టుకో.. హామీ అమలు చేయడం చేతకాకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పేద వర్గాల పెన్షన్ ను పెంచని ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్ష పార్టీలు కూడా అన్యాయం చేస్తున్నారని, అనేక అంశాల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించే పార్టీలకు ఈ కాళ్లు లేనోళ్ల, ముసలోళ్ళ సమస్యల మీద ఒక నిమిషం మాట్లాడే తీరిక లేదా అని ప్రశ్నించారు.. ఇప్పటికైనా ప్రతిపక్ష, విపక్ష పార్టీల మౌనం వీడాలని గుర్తు చేశారు.200 ఇస్తున్న పెన్షన్ 2 వేలకు పెరిగిందంటే, వికలాంగులకు 4 వేలు వస్తున్నాయంటే ఆది పాలకుల దయదక్షణ్యాల వల్ల కాదు, పార్టీల వల్లనో కాదు, పెన్షన్ పెంపు కోసం 13 ఏండ్ల కింద పాలకుల మెడలు వంచేలా లక్షలాది మందితో సభ పెట్టీ కొట్లాట చేస్తానే పెన్షన్ పెరిగిందని అన్నారు.
భూస్వాములకు రైతు భరోసాకు, అభివృద్ధి పేరుతో వేల కోట్ల ఖర్చు పెడుతున్నప్పుడు, కాళ్ళు, కళ్ళు, మాట్లాడలేని వికలాంగులకు, వయసు మీద పడిన వృద్ధులకు, భర్త లేకుండా బిడ్డలను పోషించే శక్తీ లేని వితంతువులకు, తీవ్రమైన రోగాలతో చావుతో సావాసం చేస్తున్న కండరాల, రక్త హీనత ఇతర రోగులకు ఎందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని పెన్షన్ పెంచకుండ అన్యాయం చేస్తున్నావో ఆ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 9 డెడ్ లైన్, సెప్టెంబర్ 9 లోపు పెన్షన్ పెంపుతో పాటు మా 15డిమాండ్స్ తీర్చకపోతే, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పేదలకు ద్రోహం చేసిన వారికి పాలించే అర్హత లేదని, లక్షలాది మందితో పరేడ్ గ్రౌండ్లో పెన్షన్ దారుల మహాగర్జన మహాసభతో కుప్ప కూల్చుతామని, పింఛన్దారుల శక్తి ఏందో ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు.ఎం ఆర్ పి ఎస్ పోరాటం తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ, వికలాంగుల, వృద్ధుల, వితంతువుల పెన్షన్ 200 నుండి 1000, 1500, 2000 సాధించుకొని ఆంధ్రప్రదేశ్ లోనేడు 6000 సాధించడం జరిగిందని, ఆ స్ఫూర్తి తో తెలంగాణా లో కూడా పెన్షన్ 6000 కు, ఇతర డిమాండ్స్ సాధించేవరకు విశ్రమించే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ, ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ, ఎం ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు పెంటనోల్ల నరసింహ మాదిగ, ఎం ఆర్ పి ఎస్ శంషాబాద్ ఇంచార్జి కొత్తూరు రమేష్ మాదిగ, అధ్యక్షులు చెన్నగండు భాస్కర్ మాదిగ, ఎం ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాని భాను ప్రసాద్ మాదిగ, ఎం ఎస్ ఎఫ్ శంషాబాద్ నాయకులు పాల మహేశ్ మాదిగ, రాష్ట్ర బాధ్యులు రత్నం, పెన్షన్ దారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

