జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రథమ వార్షికోత్సవం
వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులు
నమస్తే భారత్, కుత్బుల్లాపూర్ : మంగళవారం, దూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రహ్మ చారి, ఈ విద్యా సంవత్సరంలో జరిగిన అన్ని కార్యక్రమాలకు చెందిన నివేదికను చదివి వినిపించారు. అంతే కాకుండా స్కూల్ లో విద్యార్థుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. విద్యార్థుల ఉన్నతికి ఉపాధ్యాయ బృందం కృషి చేస్తుందని అన్నారు. ఈ పాఠశాల నుండి సుమారు 30 బ్యాచ్ ల విద్యార్థులు పదవ తరగతి పూర్తి చేసుకొని వెళ్లారని గుర్తుచేశారు. ప్రస్తుతం అ పూర్వ విద్యార్థులు అయిన శివకుమార్, పూజారి మహేష్, నాగరాజు యాదవ్ లు పాఠశాల అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. అనంతరం స్థానిక మాజీ కౌన్సిలర్ సరిత శివకుమార్ మాట్లాడుతూ., ఈ పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న అనేక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పిల్లలకు మంచిగా చదువు చెప్పే గురువులు మన దగ్గర ఉన్నారని కొనియాడారు. తాము కూడా ఇదే స్కూల్లో విద్యాబోధన చేసుకునందుకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామిచ్చారు . అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరూ. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Related Posts
