ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం అమలు చేయాలి..
ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం జ్యోతి
నమస్తే భారత్/ మణుగూరు
మణుగూరు: రాష్ట్రంలో ప్రతి మహిళకు నారి న్యాయం ద్వారా మహాలక్ష్మి పథకం 2500 వెంటనే అమలు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం జ్యోతి అన్నారు శుక్రవారం స్థానిక శ్రామిక భవనంలో ఐద్వా ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పిట్టల నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కార్యదర్శి ఎం జ్యోతి లక్ష్మి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వయం సహాయక సంఘాల ద్వారా పథకం అమలు చేయడం వలన సమస్యలు తలెత్తయన్నారు ఇది సరైన పద్ధతి కాదన్నారు ప్రతి పేద కుటుంబానికి ఒక మహిళకు ఏడాది లక్ష రూపాయలు సాయం చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు కేంద్ర , ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ అమలు చేస్తామని అమలు చేయలేదన్నారు. అధికార మైత్రి ద్వారా మహిళలకు చట్ట పరమైన హక్కులు మరియు ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసేందుకు ప్రతి గ్రామంలో అధికార మైత్రి నియమిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. డైరెక్ట్ గా మహిళా ఖాతాలోకి డబ్బులు జమ చేయాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఉపాధి హామీ పనులకు సంబంధం లేకుండా ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు అందించాలన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పేదలు జీవితాలు దుర్భరంగా తయారవుతున్నాయని అన్నారు. మహిళల ముందుంటున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 33% రిజర్వేషన్ మహిళ బిల్లును వెంటనే అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నత్త నడకలు ఉన్నాయని మహిళలకు ప్రవేశపెట కేంద్రంలో బిజెపి మహిళా హక్కులను కాలరాస్తుందని కాలరాస్తుందన్నారు. మహిళలకు రక్షణ లేదని పని ప్రదేశాలలో కానీ ఎక్కడ చూసినా మహిళలకు అవమానాలు ఎదురవుతున్నాయని తెలిపారు. మహిళా రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామ గ్రామాన మహిళలకు రక్షణ కల్పించే విధంగా కార్యక్రమాలు మహిళలకు చైతన్యం తీసుకురావాలని కోరారు మహిళా నాయకులు గ్రామాలలో పర్యటించి మహిళా సమస్యల పై అధ్యయనం చేయాలన్నారు ఈ సమావేశంలో మహిళా సంఘం కార్యదర్శి తోట పద్మ. గౌరీ. సారిక. ముత్యాలు. కొడిశాల ధన. ఎస్.కె కతిజ బేగం తదితరులు పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

