ఎస్బిఐ బ్యాంకులో నగదు అవకతవకల పై ఐదుగురు నిందితుల రిమాండ్: మక్తల్ సీఐ రామ్ లాల్
ఉట్కూర్ మండలం / నమస్తే భారత్
ఉట్కూర్ శాఖ ఎస్బిఐ బ్యాంకులో 2016 నుండి 2019 వరకు నకిలీ పట్టా పాస్ పుస్తకాలను సృష్టించి, బ్యాంకు అధికారులు మరియు మధ్యవర్తులు (బ్రోకర్లు) కలిసి 414 ఖాతాలలో సుమారు ₹3.91 కోట్ల మేర అవకతవకలు జరిపినట్లు విచారణలో తేలింది.
ఈ కేసులో ప్రధాన నిందితులను 1)SR నాగరాజు తండ్రి ఎల్లయ్య, బ్యాంక్ మేనేజర్, హైదరాబాద్.
2) మంత నరేష్ తండ్రి నర్సింగప్ప, క్యాషియర్, నారాయణపేట.
3) పూడూరు సత్యనారాయణ తండ్రి లక్ష్మయ్య తిప్రస్పల్లి.
4) మలీ పటేల్ సోమిరెడ్డి తండ్రి లేట్ వెంకట్ రెడ్డి, పెద్దపోర్ల.
5) జి కుర్మిరెడ్డి తండ్రి బాసి రెడ్డి. దండు, మక్తల్.
ఐదుగురిని అరెస్టు చేసి ఈరోజు రిమాండ్కు తరలించినట్లు మక్తల్ సీఐ రామ్ లాల్ తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.బ్యాంక్ అధికారుల సహకారంతో నకిలీ పట్టా పాస్ పుస్తకాలు, తప్పుడు ఖాతాల ఆధారంగా జరిగిన ఈ పెద్ద స్థాయి మోసం పై మేము పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నాము. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు.ఈ దర్యాప్తు కొనసాగుతూ, ఇంకా మరికొంతమంది నిందితులపై ఆధారాలు,సేకరించబడుతున్నాయని,ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ కోరారు.
