<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.namasthebharat.com/bjp-mp/tag-972" rel="self" type="application/rss+xml" />
                <generator>Namasthe Bharat RSS Feed Generator</generator>
                <title>bjp mp - Namasthe Bharat</title>
                <link>https://www.namasthebharat.com/tag/972/rss</link>
                <description>bjp mp RSS Feed</description>
                
                            <item>
                <title>చిట్టినాడ్ ఫ్యాక్టరీ పై కొండా సీరియస్</title>
                                    <description><![CDATA[<p>చిట్టినాడ్ ఫ్యాక్టరీ ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే రైతులతో కలిసి ధర్నా చేయడం జరుగుతుందని అదేవిధంగా ఫ్యాక్టరీ మూయించే పరిస్థితి వస్తుందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని సంగెం కలాన్ వద్ద నిర్మించిన చిట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్లక్ష్యపు బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా కొన్ని రోజుల క్రితం పడిన వర్షాలతో సంగెం కలాన్ గ్రామ రైతుల పొలాలు నాశనమయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపరిహారం ఇవ్వడంలో  అలసత్వం వహిస్తున్నారని తెలుసుకున్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫ్యాక్టరీ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/telangana/konda-serious-on-chittinad-factory/article-3154"><img src="https://www.namasthebharat.com/media/400/2025-10/img-20251014-wa00571.jpg" alt=""></a><br /><p></p><div class="pbwidget wid69e11d23b7c43 htmlwidget"><div class="pbwidget-body">
<ins class="adsbygoogle" style="text-align:center;"></ins>
</div></div>
<p>బిజెపి నాయకులతో కలిసి రైల్వే ట్రాక్ వద్ద మరియు నాశనమైన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఎంతవరకు నష్టం జరిగిందని చర్చించారు.<img src="https://www.namasthebharat.com/media/2025-10/img-20251014-wa00571.jpg" alt="IMG-20251014-WA0057" width="640" height="360"></img> </p>
<p>సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులతో రైతుల పొలాలు సమస్యలపై చర్చించారు. సిమెంట్ అమ్ముకొని డబ్బు సంపాదిస్తారు కానీ రైతులు నష్టపోతే పరిహారం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అంటూ మండిపడ్డారు. రైతులేమీ బిచ్చగాళ్లు కాదని మీరేమీ బిచ్చం వేయాల్సిన అవసరం లేదని మీ ఫ్యాక్టరీ వల్ల జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే రైతులకు పరిహారం ఇవ్వకుంటే  ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపడతానని ఫ్యాక్టరీ యాజమాన్యానికి హెచ్చరించారు. ఫ్యాక్టరీ ముయించడానికి కూడా వెనకాడమని పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని రైతులకు భరోసా కల్పించి హామీ ఇచ్చారు.  ఎంపీ తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్,కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, తదితరులు ఉన్నారు.</p>
<p></p><div class="pbwidget wid69e11d23b858e htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>
<p>Namsthe Bharat</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.namasthebharat.com/telangana/konda-serious-on-chittinad-factory/article-3154</link>
                <guid>https://www.namasthebharat.com/telangana/konda-serious-on-chittinad-factory/article-3154</guid>
                <pubDate>Tue, 14 Oct 2025 20:11:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-10/img-20251014-wa00571.jpg"                         length="77624"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>
            <item>
                <title> దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ </title>
                                    <description><![CDATA[<ul>
<li><span style="color:rgb(224,62,45);"><strong>శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong>కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ,కె.ఎస్. రత్నం, డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి</strong></span></li>
<li><span style="color:rgb(224,62,45);"><strong> విజేతలకు పతకాలు, అభినందన పత్రాలు అందజేసిన అతిథులు</strong></span></li>
</ul>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.namasthebharat.com/districts/rangareddy/south-indian-karate-championship/article-3067"><img src="https://www.namasthebharat.com/media/400/2025-09/img-20250922-wa0043.jpg" alt=""></a><br /><p>శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మణి గార్డెన్స్ వేదికగా తొలిసారిగా దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ ఘనంగా, విజయవంతంగా నిర్వహించారు. ఈ పోటీలలో దక్షిణ భారతదేశం నలుమూలల నుండి వచ్చిన వందలాది మంది యువ క్రీడాకారులు పాల్గొని తమ కరాటే ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి, పోరాట తత్వం వంటి అంశాలు ఈ పోటీలలో స్పష్టంగా కనిపించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు  కొండ విశ్వేశ్వర్ రెడ్డి హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడలు మనలో క్రమశిక్షణను, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే  కె.ఎస్. రత్నం, బీజేపీ యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి, శంకర్‌పల్లి బీజేపీ సీనియర్ నేత శ్రీ ప్రభాకర్ రెడ్డి మరియు పలువురు నాయకులు, ప్రముఖులు పాల్గొని క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. నిర్వాహకుల కృషిని కొనియాడుతూ, భవిష్యత్తులో శంకర్‌పల్లి మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఆతిథ్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్య అతిథులు పతకాలు మరియు అభినందన పత్రాలు అందజేశారు. విజేతలతో పాటు పాల్గొన్న ప్రతీ క్రీడాకారుడు కూడా ప్రోత్సాహకరమైన మాటలు విని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కోచ్‌లు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కరాటే క్రీడకు ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పిన ఈ ఛాంపియన్‌షిప్ శంకర్‌పల్లిలో ఒక మరిచిపోలేని క్రీడా వేడుకగా నిలిచింది. యువతకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇటువంటి పోటీలు తరచుగా జరగాలని క్రీడాభిమానులు అభిలాష వ్యక్తం చేశారు.</p>
<p> </p>
<p></p><div class="pbwidget wid69e11d23b5845 htmlwidget"><h3 class="pbwidget-title"><span>Publisher</span></h3><div class="pbwidget-body">
</div></div>]]></content:encoded>
                
                                                            <category>	రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.namasthebharat.com/districts/rangareddy/south-indian-karate-championship/article-3067</link>
                <guid>https://www.namasthebharat.com/districts/rangareddy/south-indian-karate-championship/article-3067</guid>
                <pubDate>Mon, 22 Sep 2025 10:59:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.namasthebharat.com/media/2025-09/img-20250922-wa0043.jpg"                         length="258864"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Journalist Shiva Kumar Bs]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        