జాతీయ రహదారిపై విద్యార్థినుల ధర్నా

అవినీతి ఆపండి... ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు

On
జాతీయ రహదారిపై విద్యార్థినుల ధర్నా

షాద్ నగర్ (రంగారెడ్డి జిల్లా): నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాలలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ వందలాది మంది విద్యార్థినులు ఆదివారం ఉదయం షాద్ నగర్ పట్టణంలో ఆందోళనకు దిగారు.

IMG-20251102-WA0100

ఉదయం సుమారు 9.45 గంటల సమయంలో కమ్మదనం శివారులోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నడుస్తున్న గురుకులం నుండి విద్యార్థినులు పాదయాత్రగా బయలుదేరి షాద్ నగర్ బైపాస్ రహదారిపై చేరుకున్నారు. "ముందు అక్రమాలు ఆపండి, తర్వాత విద్య అందించండి", "లంచగొండితనాన్ని రూపుమాపండి", "ప్రిన్సిపల్ డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై కూర్చున్నారు.

IMG_20251102_155619

విద్యార్థినులను ఆందోళన నుంచి ఆపడానికి అధ్యాపకులు, సిబ్బంది విఫలయత్నం చేశారు. అయినప్పటికీ విద్యార్థినులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ హఠాత్ ధర్నా వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులను సమాధానపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

IMG-20251102-WA0104

అయితే విద్యార్థినులు తమ ఆందోళనను విరమించక, గురుకులంలో జరుగుతున్న అవినీతి పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో షాద్ నగర్ జాతీయ రహదారిపై కొన్ని గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది.

Publisher

Namasthe Bharat

 

Share On Social Media

Related Posts

Latest News

మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి.
    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ
వికె కోల్ మైయిన్స్ కొత్తగూడెం ఏరియా కు కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు ను మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తగూడెం ఏరియా INTUC వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ 
మెరుగైన వైద్య సేవల కోసం ఆధునీకరణ చర్యలు అవసరం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. 
పర్మిషన్ లేకుండా గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత: మరికల్ ఎస్సై రాము
విద్యాభివృద్ధికి పునాది వేసిన మహనీయుడు మౌలానా అబుల్‌ కలామ్‌
పిడియస్ రైస్ పట్టివేత: మరికల్ ఎస్సై రాము
ప్రభుత్వ జాగా..ఓ లక్షాధికారి కబ్జా..!

Advertise