స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరవేయాలి...
నారాయణపేట జిల్లా / నమస్తే భారత్
కోయిల్ కొండ మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు యస్.రాజేందర్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండి ఎన్నికలకు సిద్ధం కావాలని.ఈ రోజు జరిగిన కోయిల్ కొండ మండలం ఆచార్య పూర్ గ్రామములోని వీభభద్ర స్వామి దేవస్థాన ఆవరణలో ఏర్పాటుచేసిన మండల స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా యస్. రాజేందర్ రెడ్డి హాజరై అదే విధంగా వీరభద్రేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొని ఆశీస్సులను పొందారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఏ పల్లెకు వెళ్లినా ఏ వాడకు వెళ్లినా మళ్లీ కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కావాలంటున్నారని అన్నారు.తమకు సమయానికి రైతు బంధు వేయాలని వేడుకుంటున్నారన్నారు. కనీసం 30 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదన్నారు. ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ గ్రామంలో కూడా అభివృద్ధి చేయడం లేదని మండిపడ్డారు, అబద్ధపు హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ శ్రేణులను బలపర్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలువాలని అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.నాయకులంతా సమన్వయంతో పని చేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వకర్త శ్రీ.యస్.రవీందర్ రెడ్డి మండల సీనియర్ నాయకులు, మండల కమిటీ సభ్యులు, యువ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

