తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ప్రతిభ చాటాలి
------ రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా.
నారాయణపేట జిల్లా / నమస్తే భారత్
తెలంగాణ విద్యార్థులు దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో ప్రతిభ చాటాలని రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష అదేనని, అందుకే విద్యా శాఖపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని, విద్యాశాఖలో కొత్త కొత్త పథకాలు, కార్యక్రమాలను ముందుగా తన సొంత నియోజక వర్గమైన కొడంగల్ లో అమలు చేస్తున్నారని,అందులో భాగంగానే సీఎం అల్ఫాహారం పథకాన్ని కొడంగల్ నియోజక వర్గంలోని అన్ని మండలాల ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారని, వాటి ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అంతటా అమలు చేసేలా కార్యచరణ ను రూపొందించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. విద్యా శాఖ కార్యక్రమాల అమలు తీరు తెన్నుల పరిశీలన నిమిత్తం వచ్చిన యోగితా రాణా గురువారం కొడంగల్ నియోజకవర్గంలోని గుండుమల్ మోడల్ స్కూల్/కళాశాలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ లో ఏర్పాటు చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ఆమె పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయవద్దని, ఇలాంటి సమావేశాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని తమ పిల్లల చదువు, పాఠశాలలో వసతి సౌకర్యాల గురించి తెలుసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని వారానికొకసారి పరిశీలించాలన్నారు. ప్రభుత్వ పాఠశాల అంటే ఒక కుటుంబం అన్నారు. మన బడి అనే భావన ఉండాలన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఆమె తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడుతుంటే ఆ విద్యార్థికి పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంత మంచిగా చదువు చెప్పినా... అర్థం కాదని, అలాగే ఇంట్లో తల్లిదండ్రులు మంచిగా ఉండి బడిలో ఉపాధ్యాయుల బోధన సరిగ్గా లేకపోతే చదువుపై శ్రద్ధ తగ్గుతుందని, ఇంట్లో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు ఎవరికి వారు తమ బాధ్యతలు గుర్తిస్తే చదువుపై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుందని ఆమె తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల తో పాటు వారి ఆరోగ్యం కూడా బాగుండాలని అందుకే సీఎం ప్రభుత్వ పాఠశాలలో అల్ఫాహారం పథకాన్ని అమలు చేయిస్తున్నారని, దీనివల్ల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రస్తుతం విద్యా శాఖ ప్రాథమిక పాఠశాలలలో ఏ ఎక్స్ఎల్ -ఏ 1 ల్యాబ్ పెడితే తల్లిదండ్రులు పోటీ పడి మరీ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారని చెప్పారు. ఇప్పుడున్న ఏ ఎక్స్ఎల్ -ఏ 1 ల్యాబ్ లే కాకుండా త్వరలో కంప్యూటర్లతో పాటు ఆర్టిఫిషియల్ పాఠశాలలను చేయబోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో సైన్స్ గణితం, ఖాన్ అకాడమీ ఫిజిక్స్ వాలా ద్వారా అన్ని టెస్ట్ పేపర్లు స్క్రీన్ మీద కనిపిస్తాయన్నారు. సెల్ ఫోన్లలో కూడా ఖాన్ అకాడమీని చూడవచ్చాన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చి దగ్గరుండి పరిశీలించాలన్నారు. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా చదవాలని కోరుకుంటారని చెప్పారు. అదే ప్రైవేటు కు వెళ్తే 50 నుంచి లక్ష పెట్టి కోచింగ్ తీసుకోవాల్సి వస్తుందని, కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటే డబ్బులు అవసరం లేదన్నారు. తెలంగాణ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని, విద్యార్థులు తలచుకుంటే సాధించనిది అంటూ ఏదీ లేదన్నారు. ఈ సమావేశానికి వచ్చిన తల్లిదండ్రులు మూడు నెలల్లో గుండుమల్ మోడల్ స్కూల్ లో మార్పు చూపించాలని ఆమె కోరారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. గత 6 నెలల క్రితం సీఎం బ్రేక్ ఫాస్ట్ ప్రోగ్రాం కొడంగల్ నియోజక వర్గంలో ప్రారంభమైందని, అందుకే ఇక్కడి గుండుమల్ మోడల్ స్కూల్ లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
విద్యార్థులకు న్యూట్రీషియన్ తో కూడిన ఆహారం ఇవ్వాలని సీఎం ఈ కార్యక్రమం చేయిస్తున్నారన్నారు. ఎడ్యుకేషన్ సెట్ కావాలంటే ముందుగాఓ విద్యార్థుల ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ పాఠశాలకు కంప్యూటర్లు ఇచ్చామని చెప్పారు. జిల్లాలోని గుండుమల్ మోడల్ స్కూల్ లో ఎన్ రోల్ మెంట్ పెరిగినా, ధన్వాడ మోడల్ స్కూల్ లో ఆశించిన స్థాయిలో పెరగ లేదన్నారు. పీఎం శ్రీ కింద ఎంపికైన గుండుమల్ మోడల్ స్కూల్ కి కేంద్రం, రాష్ట్రం నుంచి చాలా నిధులు వస్తాయన్నారు. ఇప్పటికే కడ నుంచి 60 లక్షల ప్రత్యేక నిధులు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నెకోలస్ మాట్లాడుతూ చాలా మోడల్ స్కూల్ లలో రెగ్యులర్ స్టాప్ ఉన్నారని, కానీ పదో తరగతి ఫలితాలలో 85 శాతం ఉత్తీర్ణత మాత్రమే ఉంటుందని, కానీ కస్తూర్బా పాఠశాలలలో కాంట్రాక్టు ఉపాధ్యాయులే ఉన్నా అక్కడ 99 శాతం ఫలితాలు ఉంటున్నాయని చెప్పారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఇంకా ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఫలితాల మెరుగుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఖాన్ అకాడమీ పదో తరగతి విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉందని అభిప్రాయపడ్డారు. మోడల్ స్కూల్ లలో ఎంసెట్, నీట్ కోచింగ్ కూడా ఇస్తున్నామని ఆయన తెలిపారు. అవసరమైతే మరికొన్ని కంప్యూటర్లు కూడా ఇస్తామన్నారు. అనంతరం కలెక్టర్, కడ అధికారి తో కలిసి యోగితా రాణా ఆ మోడల్ స్కూల్ మొత్తం కలియ తిరిగారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం బాగుంటుందా అని వారిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని బయాలజీ ల్యాబ్, కంప్యూటర్ గది, ఇంగ్లీష్ ల్యాబ్, లైబ్రరీ, బ్యూటీషన్ ట్రైనర్ గది, లైబ్రరీ,మరుగుదొడ్లు, పాఠశాల పరిసరాలను చూసి అపరిశుభ్రతపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ పై అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు వెంకట నరసమ్మ, మదన్, ఆర్జెడి విజయలక్ష్మి, రాష్ట్ర విద్యాశాఖ జి సి డి ఓ శిరీష, డిఇఓ గోవిందరాజులు, జి సి డి ఓ నర్మద, విద్యా శాఖ అధికారులు విద్యా సాగర్, శ్రీనివాస్, యాదయ్య శెట్టి, తహసీల్దార్ మహేష్ గౌడ్, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

